GNTR: ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, యువతకు పిలుపునిచ్చారు. ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలై, తర్వాత పెద్ద నష్టాలకు దారి తీస్తాయని తెలిపారు.