W.G: తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 32 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు 9 లక్షల 57 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుందని అంచనా వేసామన్నారు. జిల్లాలో 7 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల దాన్యం సేకరించాలని తెలిపారు.