తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా రూ. 2,168 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది. ఇది గతేడాది రూ. 1,822 కోట్ల కంటే 19 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇతర ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక వృద్ధి నమోదైంది. ఏపీలో జీఎస్టీ ఆదాయం 1 శాతం పెరిగి రూ. 1,399 కోట్ల నుంచి రూ. 1,416 కోట్లకు పెరిగాయి.