E.G: పేదరికాన్ని జయించి గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికైన కడియం మండలం దామిరెడ్డిపల్లికి చెందిన చింతపర్తి దీప్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ అమ్మాయికి పెద్దాపురం సర్కిల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు దీప్తి ఎక్సైజ్ సీఐకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బాధ్యతలు స్వీకరించారు. విద్య వాలంటీర్గా పనిచేస్తూ కష్టపడి చదువుకుని విజయాన్ని సాధించారు.