అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆదాయ వృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో తప్పనిసరిగా జీఎస్టీ అమలు చేయాలని ఆదేశించారు.