రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ గ్రహీత విజయ్పత్ సింఘానియా(87) ముంబైలో కన్నుమూశారు. తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు గౌతమ్ ధృవీకరించారు. 1980లో బాధ్యతలు చేపట్టిన విజయ్పత్, రేమండ్ను అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చిదిద్దారు. ఆయన హాట్ ఎయిర్ బెలూన్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఏవియేటర్. ముంబైలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.