తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘నీలిర’ ట్రైలర్ లాంచ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ‘దురందర్ 2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.