అన్నమయ్య: తంబళ్లపల్లె గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు లైబ్రేరియన్ జిలానీ బాషా తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు TVలు, ఫోన్లకు బానిస కాకుండా ప్రభుత్వం, ఉన్నతధికారుల ఆదేశాలతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి నుంచి జూన్ 6 వరకు పిల్లలకు దినపత్రికలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, యోగా నేర్పించడం చేస్తామన్నారు.