కృష్ణా: అవనిగడ్డ మండలం వేకనూరులో పునర్ నిర్మించిన మాదివాడ వారి కోదండ రామాలయ ప్రతిష్ట బుధవారం జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే ప్రతిష్ట గావించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే దంపతులు మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి పాల్గొన్నారు. మహా కుంభ ప్రోక్షణ, మహామృత దివ్య కార్యక్రమాలు, భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.