E.G: రానున్న పుష్కరాల దృష్ట్యా కొవ్వూరు పరిధిలోని భూములను MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు PPP విధానంలో కాటేజీలు, గదులు, స్నానాల గదులు వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు.