E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఫీజులు తగ్గింపు అధికార పక్షం, ప్రతిపక్షం ఆమోదంతోనే జరిగిందన్నారు.