VSP: జిల్లాలోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా నలుగురు డైవర్లు ఆనంద్, సతీష్, నరేష్, రాజు ఒక బృందంగా ఏర్పడి భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన దేశభక్తి వేడుకలో పాల్గొన్నారు. ఈ బృందం, రుషికొండ సమీపంలోని సముద్ర నీటిలోకి లోతుగా వెళ్లి అక్కడ వారు నీటి అడుగున భారత జాతీయ జెండాను గర్వంగా ఆవిష్కరించారు. ఈ దృశ్యం చూడడానికి అద్భుతంగా ఉంది.
VZM: రాష్ట్ర ఐటి, విద్యా శాఖా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో చిన్నతరహా పరిశ్రమలు శాఖ మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం భేటీ అయ్యారు. విశాఖ పర్యటనకు వచ్చిన నారా లోకేష్ను విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు.
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయులు సోమవారం పర్యటించనున్నారు. అందులో భాగంగా పెద్ద చెర్లోపల్లిలో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న తరగతి గదులకు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు.
SKLM: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ స్వప్నల్ దినకర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
CTR: చిత్తూరులో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. చవటపల్లిలోని దుర్గమ్మ గుడి దేవస్థానం వద్ద ఆదివారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురికీ తరలించామన్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
KDP: మైదుకూరు నియోజకవర్గ వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షునిగా ఎద్దు సుబ్బారాయుడుని పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. సుబ్బారాయుడు కేంద్ర కార్యాలయం నియమించడంతో తన నియామకానికి సహకరించిన జగన్కి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి, ఎంపీ అవినాశ్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన మైల నాగిరెడ్డికి ఆచార్య నాగార్జున గుంటూరు యూనివర్సిటీలో ‘నాణ్యమైన ఆరోగ్యకరమైన పాలు మరియు పాలవృత్తుల వినియోగంపై’ డాక్టరేట్ అందుకున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి ఉన్నత స్థాయికి ఎదగడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా పట్టణానికి చెందిన పలువురు మైల నాగిరెడ్డిని అభినందించి, సన్మానించారు.
E.G: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, టీడీపీ కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జిల్లా బీజేపీ అధ్యక్షులు పక్కి నాగేంద్రతో కలసి ఆదివారం చాగల్లు మండలం చాగల్లులో రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జుట్ట తాతాజీ పొంగునూరు ఆవు దూడను అందరు తిలకించారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల నానీ, హరిబాబు పాల్గొన్నారు.
KDP: మైదుకూరులో గతంలో ఏర్పాటు చేసిన చిన్న విగ్రహాల స్థానంలో పెద్దవి ఏర్పాటు చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా బావిస్తున్నానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మైదుకూరులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, వేమారెడ్డి విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు, స్వాగతం పలికారు.
CTR: కుప్పం రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ విధి నిర్వహణలో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందజేసింది.ఆదివారం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు మల్లేశ్ యాదవ్కు ప్రశంసాపత్రం అందజేశారు. రూరల్ సర్కిల్ పరిదిలో పలు కేసుల పరిష్కారానికి మల్లేశ్ యాదవ్ విశేష ప్రతిభ కనబరిచారు. మల్లేశ్ యాదవ్ను పలువురు అభినందించారు.
KKD: పులిమేరు పంచాయతీ కార్యదర్శి బళ్ళ బుల్లి వెంకటరమణకు ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడలో జరిగిన అవార్డుల ప్రాదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ చేతుల మీదుగా బళ్ల బుల్లి వెంకటరమణ అవార్డు అందుకున్నారు. తన సేవలకు గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విధుల పట్ల అంకీతభావంతో పని చేస్తానన్నారు.
E.G: సీతానగరం ఎంపీడీవో మండల పరిధిలో సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పీ.జీ.ఆర్.ఎస్ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా జిల్లా కలక్టరేట్ నుంచే హజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు.
W.G: సీసలి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సుమారు 800 మంది దంపతులతో భక్తులచే ఉచిత సామూహిక సాయి సత్య వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి సబ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న రవణయ్య ఉత్తమ లైన్ మెన్గా ఎంపికయ్యాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపిక అయిన రవణయ్యకి మైదుకూరు ఈఈ ప్రశంస పత్రం అందచేశారు. డివిజన్లోని ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్లో ఇంకా బాగా పనిచేయాలని కోరారు.
W.G: భీమవరం పట్టణంలో కొలువైన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన కలిదిండి వెంకట దిలీప్ కుమార్ వర్మ 10 గ్రాములు బంగారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మద్దిరాల రమణ శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి ఫొటోను వారికి అందించారు.