• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించిన FMT

VZM: రామభద్రపురం మండలం అరికతోటలో శనివారం నేషనల్‌ మిషన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ FMT (Farmer Master Trainer) లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి సేద్యంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఈ గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏయే పంటలు సాగుచేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

March 22, 2026 / 08:00 AM IST

పాము కాటు.. గీత కార్మికుడు మృతి

సత్యసాయి: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య 60 శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో కళ్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్న సమయంలో రక్తపింజరి పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు అతన్ని పొదలకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.

March 22, 2026 / 08:00 AM IST

పెరిగిన మాంసం ధరలు

NLR: జిల్లాలో మాంసం ధరలు కాస్త పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.304, స్కిన్ లెస్ చికెన్ రూ.317, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

March 22, 2026 / 08:00 AM IST

సీపీఎం పాదయాత్రకు మండలి ఛైర్మన్ మద్దతు

W.G: సీపీఎం చేపట్టిన ‘ప్రజా చైతన్య పాదయాత్ర’ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు శనివారం రాత్రి అభినందించారు. భీమవరంలో సాగుతున్న యాత్రను చూసి తన వాహనాన్ని ఆపి, బృందంతో మాట్లాడారు. ఈ సందర్భంగా JNV గోపాలన్ ప్రజా సమస్యలపై రూపొందించిన వినతిపత్రాన్ని ఛైర్మన్‌కు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు

March 22, 2026 / 07:58 AM IST

యువకుడు మిస్సింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

E.G: రాజమండ్రి టూ టౌన్ పరిధిలో శనివారం ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. టీ నగర్‌లోని కోడూరి ప్లాజాలో నివసిస్తున్న గోవింద్ సూతర్ (29) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన CI శివ గణేశ్ దర్యాప్తు చేస్తున్నారు.

March 22, 2026 / 07:50 AM IST

ఎమ్మిగనూరులో యువకుడు గుండెపోటుతో మృతి

KRNL: ఎమ్మిగనూరు పట్టణం 30వ వార్డులో 21 ఏళ్ల యువకుడు గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ, వైసీపీ వార్డు ఇన్‌ఛార్జ్ కోరిశెట్టి విశ్వనాధ్, తదితర నాయకులు మృతుడి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.

March 22, 2026 / 07:47 AM IST

‘బనగానపల్లెలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం’

NDL: బనగానపల్లె మండలం పలుకూరులో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.1.88 కోట్ల విలువైన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాంప్ కార్యాలయం తెలిపింది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.

March 22, 2026 / 07:46 AM IST

రేపు జిల్లాకు రానున్న మంత్రి నారాయణ

KKD: రేపు కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంచార్జి మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. వివేకానంద సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని, జిల్లా అధికారులు హాజరుకావలన్నారు. 

March 22, 2026 / 07:41 AM IST

నాగాయలంక క్రీడాకారిణికి జాతి స్థాయిలో గుర్తింపు

కృష్ణా: నాగాయలంక మత్స్యకారు కుటుంబానికి చెందిన నాగిడి గాయత్రి విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఆమె ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కోచ్‌లు సర్టిఫికెట్‌తో పాటు అవార్డును శనివారం అందజేశారు.

March 22, 2026 / 07:40 AM IST

బ్యాట్ పట్టిన బాబాయ్.. బంతి విసిరిన అబ్బాయ్

శ్రీకాకుళం నగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రూ.2 కోట్లతో నిర్మించిన కార్గిల్ పార్కును ప్రారంభించారు. ఈ పార్కులో బాబాయ్ అబ్బాయ్ కాసేపు బ్యాట్ పట్టి బాక్స్ క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 07:40 AM IST

క్రోసూరు మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలు

PLD: క్రోసూరు మోడల్ స్కూల్లో 2026-27 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మేరీ సుసాన్ శనివారం వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు MPC, Bi.PC, MEC,CEC గ్రూపులలో విద్యను ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. మార్చి 18 తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:34 AM IST

ప్రశాంతంగా ముగిసిన ఉగాది ఉత్సవాలు

ATP: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాబయం వరకు తీసుకెళ్లారు. భక్తులు ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

March 22, 2026 / 07:30 AM IST

రోడ్డు నియమాలను తప్పక పాటించాలి: సీఐ

NLR: సంగం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి సీఐ శ్రీనివాస రెడ్డి, S1 రాజేశ్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

March 22, 2026 / 07:30 AM IST

బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి భారీ విరాళం

సత్యసాయి: పుట్టపర్తిలో బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి ప్రముఖుడు బెస్త బయన్న రూ. 5,10,012 విరాళం అందజేశారు. ఈ నిధులు నిర్మాణ పనులకు కీలకంగా మారుతాయని కమిటీ సభ్యులు జ్యోతి కేశవ, జై సాయి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, కులస్తులు, దాతలు సహకరించాలని కోరారు. సామాజిక బాధ్యతతో స్పందించిన బయన్నను స్థానికులు అభినందిస్తున్నారు.

March 22, 2026 / 07:29 AM IST

హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 271 మందిపై కేసులు నమోదు చేసి, రూ.57,450 జరిమానా విధించారు. కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 07:28 AM IST