• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం మల్లన్న సన్నిధికి పెరుగుతున్న విదేశీ భక్తులు

NDL: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హమ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.

March 22, 2026 / 08:21 AM IST

అకాల వర్షాలకు పొగాకు రైతులకు నష్టం

ELR: అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పొగాకు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన పంట దెబ్బతిని చాపలా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రోజుల పాటు కష్టపడి సాగు చేసిన పంట ఒక్కసారిగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటామని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు తిరిగి రావని దిగులు చెందుతున్నారు.

March 22, 2026 / 08:16 AM IST

వేల్పూరులో టీడీపీ నాయకుడు మృతి

కృష్ణా: పమిడిముక్కల మండలం వేల్పూరులో టీడీపీ నాయకుడు చీకుర్తి ఏసుబాబు మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గ్రామానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు మృతునికి శ్రద్ధాంజలి ఘటించారు.

March 22, 2026 / 08:15 AM IST

ఘనంగా మత్స్య జయంతి వేడుకలు

TPT: నాగలాపురం మండలంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. నిన్న ఉదయం ప్రత్యేక పూజలు, మహాశాంతి హోమం నిర్వహించి, సాయంత్రం గరుడవాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం చేపట్టారు. మత్స్యకారులు ఇరుముడులతో పాల్గొని భక్తి చాటగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

March 22, 2026 / 08:11 AM IST

జిల్లాలో మాంసం ధరలు

GNTR: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ చికెన్ ధర రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300 పలుకుతోంది. కేజీ మటన్ ధర రూ. 960 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే.. కొరమేను రూ. 430, బొచ్చెలు రూ. 230లుగా ఉన్నాయి.

March 22, 2026 / 08:10 AM IST

ఈనెల 25న జాబ్ మేళా

PPM: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న పార్వతీపురంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య తెలిపారు. గాయత్రి కళాశాలలో జరిగే ఈ మేళాకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు హాజరు కావచ్చన్నారు. పూర్తి వివరాలు కొరకు వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపారు.

March 22, 2026 / 08:10 AM IST

ఈ నెల 31న చీమకుర్తి తిరునాళ్లు

ప్రకాశం: చీమకుర్తిలో ఈ నెల 31వ తేదీన తిరుణాళ్లు నిర్వహించనున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు. సాయంత్రం సమయాల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తిరుణాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

March 22, 2026 / 08:10 AM IST

కాకినాడ పోర్డు గోదాముల్లో జేసీ తనిఖీలు

KKD: పోర్ట్ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీవో, పౌరసరఫరాల అధికారులు, పోలీసులతో కలిసి 29 గోదాములు, చెక్ పోస్టులను పరిశీలించారు. బియ్యం స్టాక్, రవాణా రికార్డులు, రిజిస్టర్లను సవివరంగా పరిశీలించి అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. 

March 22, 2026 / 08:10 AM IST

నేడు జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే

KRNL: ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.310, స్కిన్‌లెస్ రూ.340 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-20 వరకు పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కోళ్లు ధరలు పెరగడంతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్తులు అన్నారు.

March 22, 2026 / 08:08 AM IST

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

KDP: ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300, స్కిన్‌లెస్ చికెన్ రూ.342, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.

March 22, 2026 / 08:04 AM IST

రేపు ‘మీ ఇంటికి-మీ డాక్టర్’ సేవలు ప్రారంభం

W.G: కలెక్టర్ నాగరాణి చొరవతో జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి-మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. రేపు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు.

March 22, 2026 / 08:02 AM IST

మహిళల కోసం పింక్ టాయిలెట్

శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్ల ను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

March 22, 2026 / 08:00 AM IST

రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ దంపతులు

ATP: రాయదుర్గం సిద్ధప్పకొండపై వెలసిన శ్రీ రస సిద్ధేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథానికి గుర్రాలను పంపే ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 22, 2026 / 08:00 AM IST

రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించిన FMT

VZM: రామభద్రపురం మండలం అరికతోటలో శనివారం నేషనల్‌ మిషన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ FMT (Farmer Master Trainer) లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి సేద్యంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఈ గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏయే పంటలు సాగుచేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

March 22, 2026 / 08:00 AM IST

పాము కాటు.. గీత కార్మికుడు మృతి

సత్యసాయి: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య 60 శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో కళ్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్న సమయంలో రక్తపింజరి పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు అతన్ని పొదలకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.

March 22, 2026 / 08:00 AM IST