అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దీరజ్ శనివారం తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.
VZM: ఈ నెల 24 నుంచి చీపురుపల్లిలోని స్దానిక కస్పా వీధిలో వెలసిన శ్రీ సిర్లు ఎల్లమాంబ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త అడ్డూరి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆనవాయితీగా శ్రీ కనకమాలక్ష్మి జాతర చివర రోజున సిర్ల ఎల్లమాంబ జాతర నిర్వహిస్తారని వివరించారు.
అన్నమయ్య: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో ఆయన మాట్గత వైసీపి ప్రభుత్వం 3.32 లక్షల అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం 20 నెలల్లోనే 3. 20 లక్షల అప్పు చేసిందని, అభివృద్ధి చేయకుండా మాటలతో కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు.
PLD: పల్నాడు కలెక్టరేట్లో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, మొక్కజొన్న రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అలాగే, కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MP బాలశౌరి, NTR జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు.
GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 45,000 నగదుతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
BPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షక కవచమని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు విధించారు.
VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పూడి వరప్రసాద్ సీసీ ఫుటేజీ పరిశీలించారు.
కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీ నందు జరుగుచున్న సీసీ రోడ్లు, డైన్ పనులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. దేవుడు కాలనీలో పనులు జరుగుచున్న ప్రతీచోట తిరిగి డ్రైన్స్ లెవిలింగ్ను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
KRNL: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై BJP నాయకులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పెద్దకడబూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ రాజ్ ఇవాళ అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, అభివృద్ధి చేసి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ELR: కైకలూరులోని పెట్రోలు బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయా పెట్రోల్ బంకులలో ఉత్తమ సేవలు అందించిన మొత్తం తొమ్మిది మంది కార్మికులకు ప్రోత్సాహ బహుమతులు అందించామన్నారు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రతి నెల నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నామన్నారు.
W.G: ఏకీకృత కుటుంబ సర్వే పై సంబంధిత అధికారులతో పగో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లాలో 6,30,947 కుటుంబాలను సర్వే చేయవలసి ఉండగా నేటి వరకు 4,73,506 కుటుంబాల సర్వేను వివిధ శాఖల సిబ్బంది పూర్తి చేయడం జరిగిందన్నారు. శాఖల వారీగా సూచించిన కుటుంబ సర్వే లక్ష్యాలను త్వరగా పూర్తిచేసి నివేదిక అందజేయాలని తెలిపారు.
అన్నమయ్య: శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటాలను రాజకీయ నిరసనలకు వాడటం దైవద్రోహమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం దైవాన్ని వాడుకోవడం మహా పాపమని హెచ్చరించారు.