• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారు..!

CTR: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 23 రాత్రి శాంతిపురం నివాసానికి చేరుకుని, 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలతో సమావేశాలు నిర్వహించనున్నారు. రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ‌లో పాల్గొననున్నారు. NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు, తోపుడు బండ్ల పంపిణీ చేయనున్నారు.

March 22, 2026 / 02:31 PM IST

అకాల వర్షానికి అన్నదాత అవస్థలు

GNTR: అకాల ఈదురు గాలులతో కూడిన వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్న కారణంగా కాకుమాను మండలంలో ఎకరాల కొద్దీ సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకూలిపోయింది. పంట పూర్తిగా పడిపోవడంతో దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

March 22, 2026 / 02:30 PM IST

ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పలువురు అరెస్ట్..!

KDP: ఖాజీపేట(M) నాగసానిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DSP రాజేంద్ర ప్రసాద్, సీఐ వంశీధర్‌లు వివరాలు వెళ్లడించారు. 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పారిపోయినట్లు పేర్కొన్నారు.

March 22, 2026 / 02:30 PM IST

సీపీఎం భవనానికి విరాళం అందజేత..!

KRNL: ఆదోని సుందరయ్య భవన్ నిర్మాణానికి కల్లుబావి ప్రాంతానికి చెందిన సీపీఎం మాజీ కౌన్సిలర్ పీ.ఎస్.ముత్తమ్మ రూ. 20 వేల విరాళం ఆదివారం అందజేశారు. ఈ మొత్తాన్ని సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్నకు, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్నతో పాటు నాయకులు కృష్ణమూర్తి, సమక్షంలో అందించారు. ముత్తమ్మ సహకారానికి సీపీఎం పట్టణ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.

March 22, 2026 / 02:29 PM IST

తిరుపతిలో ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం

TPT: తిరుపతిలో నిర్వహించిన దక్షిణ ప్రాంత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం, అడ్వకేసీ వర్క్‌షాప్‌లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిని దేశంలో ప్రముఖ ల్యాండ్‌ మార్క్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. వైద్య రంగంలో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

March 22, 2026 / 02:27 PM IST

ఘనంగా శాలివాహనుడి జయంతి వేడుకలు

W.G: శక పురుషుడు శాలివాహనుడి జయంతిని జిల్లాలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సొసైటీ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గురుజుకోట రాకేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 02:25 PM IST

వర్షాలతో చెరువుల్లా మారిన రోడ్లు

VZM: శనివారం వేపాడ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో పంట పొలాలు, రహదారులంతా జలమయంగా మారాయి. అక్కడక్కడా రోడ్లు చెరువులను తలపించాయి. అకాల వర్షాలతో పట్టణ వాసులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

March 22, 2026 / 02:24 PM IST

‘సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ’

KRNL:  రోగులకు సీఎం సహాయనిధి పెద్ద భరోసా అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసుతో మంజూరైన నిధులను ఇవాళ పంపిణీ చేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి 22 మందికి మొత్తం రూ. 24.27 లక్షల చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 22, 2026 / 02:23 PM IST

భారీగా తరలిన ఆక్వా రైతులు.. డిమాండ్లు ఇవేనా..!

W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 02:18 PM IST

జిల్లాలో భారీగా తరలిన ఆక్వా రైతులు..!

W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 02:18 PM IST

వీరవాసరంలో సదస్సు.. భారీగా తరలిన రైతులు..!

W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 02:18 PM IST

జిల్లా ప్రజలకు అలర్ట్..!

CTR: చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.

March 22, 2026 / 02:15 PM IST

మారెమ్మ తల్లి ఆలయానికి శంకుస్థాపన

KDP: జమ్మలమడుగు మండలం భీమరాయుని కొట్టాలలో నూతనంగా నిర్మించనున్న మారెమ్మ తల్లి, సేవలాల్ మహారాజ్ దేవాలయాలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

March 22, 2026 / 02:13 PM IST

నూతన పోలీసు కార్యాలయంలోనే PGRS వేదిక

అన్నమయ్య: ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమం ఇకపై నూతన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆధునిక వసతులతో కూడిన ఈ కార్యాలయంలో ఫిర్యాదుదారులు నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి సమస్యను అధికారులతో కలిసి విజయవంతంగా పరిష్కరిస్తామని తెలిపారు.

March 22, 2026 / 02:09 PM IST

గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక

ATP: గుత్తి మండల వ్యాప్తంగా డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన వారు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని సిలిండర్లు పొందాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఎవరూ కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లవద్దన్నారు. ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 22, 2026 / 02:08 PM IST