• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.

February 21, 2026 / 08:23 PM IST

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.

February 21, 2026 / 08:23 PM IST

తిరుపతిలో స్వర్ణోత్సవ వేడుకలు

CTR: కరకంబాడి లోని Amara Raja Group ఆడిటోరియంలో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:21 PM IST

‘మధుడిలో ఆధార్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి’

సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్‌ సంబంధించిన బయోమెట్రిక్‌ అప్టేట్‌, ఐరిస్‌ స్కాన్‌, పేరు మార్పులు, ఫొటో అప్డేట్‌, పుట్టిన తేదీ మార్పు, సెల్‌ నంబరు లింక్‌, కొత్తగా ఆధార్‌ కార్డులు ప్రింట్‌ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...

February 21, 2026 / 08:20 PM IST

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

SKLM: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ నేతృత్వంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్‌లో ఇందిరా భవన్ వద్ద బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

February 21, 2026 / 08:19 PM IST

చిత్తూరు ఎమ్మెల్యే రేపు పర్యటన షెడ్యూల్

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పుత్తూరు రోడ్డులో మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం, పీవీపీఎన్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఆఫీస్ బస్టాండ్ వద్ద పార్టీ భవన భూమిపూజ, రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

February 21, 2026 / 08:17 PM IST

భాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

VZM: గంట్లాం గ్రామంలో నివాసం ఉంటున్న చిట్టిబాబు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో కుటుంబానికి ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయంగా రూ.15,000 నగదు, సరుకులు ఇచ్చారు.

February 21, 2026 / 08:16 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన మంత్రి

ASR: కోటవురట్ల మండలానికి చెందిన స్వచ్ఛ రథాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు స్వచ్ఛ రథాలు దోహదపడతాయన్నారు. పొడి చెత్తను తీసుకుని అవసరమైన నిత్యవసరం వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:13 PM IST

బాలిక మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు

KKD: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన రాత్రి 17 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన ప్రత్తిపాడు SI ఎస్. లక్ష్మీకాంతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కోసం వెతికారు. ఏర్పాటైన 8 గంటల్లో ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు ఇవాళ అప్పగించారు. 

February 21, 2026 / 08:09 PM IST

రేపు విశాఖకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం

VSP: భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీ.వీ.ఆర్. సుబ్రహ్మణ్యం ఆదివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 23వ తేదీ ఉదయం 9 గంటలకు వాయు మార్గంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

February 21, 2026 / 08:05 PM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 22,303 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.

February 21, 2026 / 08:03 PM IST

ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పీ. జగదీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో క్రైమ్ రేట్ తగ్గించాలని సూచించారు.

February 21, 2026 / 08:02 PM IST

‘ప్రజాదర్బార్’ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఇబ్బందులను ఆమె స్వయంగా వింటూ, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 08:01 PM IST

బీజేపీలో చేరిన ABVP పూర్వ విద్యార్థి నాయకుడు

W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఏబీవీపీ పూర్వ విద్యార్థి నాయకుడు మంగుతుర్తి మెహెర్ రాజ్ శనివారం బీజేపీలో చేరారు. భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని మంత్రి శ్రీనివాస్ వర్మ సూచించారు. మోదీ నాయకత్వంలో సుసంపన్నమైన పాలన ప్రజలకు లభిస్తుందన్నారు.

February 21, 2026 / 08:00 PM IST