KKD: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన రాత్రి 17 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన ప్రత్తిపాడు SI ఎస్. లక్ష్మీకాంతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కోసం వెతికారు. ఏర్పాటైన 8 గంటల్లో ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు ఇవాళ అప్పగించారు.