ప్రకాశం: పెద్దారవీడు మండలం గొబ్బూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కూటమి నాయకులు ఎగ్జామ్ పాడ్స్ అందజేశారు. పరీక్ష ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణులు అవ్వాలన్నారు. 570 మార్కులు సాధించిన విద్యార్థులకు లాప్టాప్ బహుమతిగా ఇస్తామని దూదేకుల కాసిం, నల్లపాటి ఈశ్వర్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.