AKP: ఎలమంచిలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులకు నిర్వహించిన విజ్ఞాన యాత్రలో మామిడి, జీడి తోటల పెంపకం అంటుకట్టు విధానంపై అవగాహన కల్పించినట్లు ఏవో మోహన్ రావు మంగళవారం తెలిపారు. పోలవరం జిల్లా ఉద్యానవన కేంద్రంలో తాటి పండ్ల నీరాపై వ్యవసాయ శాస్త్రవేత్త ప్రవీణ్ వివరించినట్లు పేర్కొన్నారు. పామాయిల్ తోటల సాగు సస్యరక్షణ చర్యలు తెలియజేసినట్లు తెలిపారు.