TG: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని CM రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చి.. రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదన్నారు. CM, మంత్రుల వైఫల్యం దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు.