ASR: కోటవురట్ల మండలానికి చెందిన స్వచ్ఛ రథాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు స్వచ్ఛ రథాలు దోహదపడతాయన్నారు. పొడి చెత్తను తీసుకుని అవసరమైన నిత్యవసరం వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.