ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.