E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.