PLD: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేశారు. వేసవిలోపు తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేయాలి. పారిశుధ్యం మెరుగుపరచాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేయాలి. ఖాళీ స్థలాలపై పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు.
VZM: గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు.
SKLM: బూర్జ మండలం ఓపివాడ వెంకంపేట గ్రామంలో శనివారం టేకు చెట్లు, మామిడి తోటలు, వరికుప్పలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసిందని గ్రామస్తులు తెలిపారు. సుమారు 50 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. సంబంధిత రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బాధితులు లబోదిబోమంటున్నారు.
GNTR: పేదల భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని CPM మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. శనివారం పెదకాకానిలో CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. పేదల నివాస భూములను పెద్దలకు అప్పగించే కుట్రపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,72,911 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు.
ATP: బుక్కరాయసముద్రంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 16 మండలాల్లో స్వచ్ఛ రథాలను జిల్లా పరిషత్ సీఈవో శివ శంకర్, DPO నాగరాజ నాయుడు ప్రారంభించారు. గ్రామాల్లో పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేసే వస్తు మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.
TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స, మందుల సరఫరాపై ఆరా తీశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
NLR: ఉలవపాడు మండలం కరేడు పంచాయితీలోని రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన గళం వినిపించారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. BPCL కంపెని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరేడు నుంచి రామకృష్ణాపురానికి వచ్చే మంచినీటి పైప్ లైన్ ధ్వంసం అయిందని ఆరోపించారు.
ASR: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో భాగంగా అరకు ప్రభుత్వ ఆసుపత్రిని RTC జోన్ ఛైర్మన్ దొన్ను దొర శనివారం తనిఖీ చేశారు. వార్డులన్నీ కలియ తిరిగి పారిశుధ్యం, వైద్య సేవలు, మందుల సరఫరాపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు
ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి,గుండ్రెడ్డిపల్లి, దద్దవాడ, అలసందలపల్లి, నారాయణ పల్లి, వెంకటంపల్లి గ్రామాలకు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
AKP: గొలుగొండ మండల పరిషత్ కార్యాలయ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుందరంగా ముస్తాబిస్తున్న కార్యాలయం ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీవో యువి.ఎస్. శ్రీనివాసరావు ఆధునీకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చెప్పారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,01,761 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 513 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 17 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 4,871 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.
NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి 200మంది భక్తులు తరలివచ్చారు. భద్రాచలం అహోబిలం మఠం అర్చకుడు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నరసింహస్వామి దీక్షాపరులు, భక్తులు తరలివచ్చి నవ నరసింహ క్షేత్రాలను దర్శించుకున్నారు. అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్రను కలిసి భద్రాచలం నుంచి తెచ్చిన మాలమర్యాదలను ఇచ్చారు.
అన్నమయ్య: మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరికృష్ణ, మాలతి, రాహుల్ తమను దారుణంగా కొట్టారని బాధితులు శంకర, ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు.
VZM: డెంకాడ మండలం సింగవరం పంచాయితీ లెంకపేట గ్రామంలో నిర్మించనున్న నూతన రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ శనివారం విరాళం అందజేశారు. అక్కివరం తన స్వగృహంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ.25,000 విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.