సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,72,911 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు.