TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స, మందుల సరఫరాపై ఆరా తీశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.