సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ATP: మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తుంగభద్రా నదీతీరంలో వెలసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు.
W.G: ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పిలుపునిచ్చారు. శనివారం ఆకివీడులోని సీపీఎం ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా స్థాయిలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు .
AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వై. వెంకట భాస్కరరావు మాట్లాడుతూ.. సభ్యులందరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. సీఈవో మల్ల స్వామి పాల్గొన్నారు.
W.G: సోషల్ మీడియాతోపాటు మీడియా ఛానెళ్లలో మతపరమైన చర్చలను నిషేధించాలని జాతీయ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ గవర్నర్ జిషుదేవ్ వర్మను తణుకుకు చెందిన ఫెలోషిప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ రెవరెండ్ మాథ్యూ మీగర్, చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ ఓ. మనోజ్ బాబ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషన్ అనుపమ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కృష్ణా: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెల 23 నుంచి PGDCA కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ జి. అంకమ్మరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ 9100033552, 8074932997 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏలూరు టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు దైవభక్తి లేదని, అపవిత్ర పాలన సాగించారని విమర్శించారు.
VZM: చీపురుపల్లిలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీ కనకమహాలక్ష్మి జాతరకు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP రాఘవులు శనివారం తెలిపారు. ఈ మేరకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసామని, ఇద్దరు DSPలు, 9 మంది Cl లు, 30 మంది SIలు,600 మంది సిబ్బంది బందోబస్త్లో పాల్గొంటారని తెలిపారు.
ELR: లింగపాలెం మండలం రంగాపురం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కిరాయి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న బాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
BPT: కొరిసపాడు మండలం బొడ్డువారిపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏల్చూరి కస్తూర్భా పాఠశాల SO లక్ష్మి, ఆమె భర్త రవిబాబు గాయపడ్డారు. పాఠశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
అనకాపల్లి జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎం వినోద్ బాబు తెలిపారు. జిల్లాలో 34 కేంద్రాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 26,301 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతి సదుపాయాలు కల్పించామన్నారు.
PLD: మాచర్లకు చెందిన అధ్యాపకుడు కాకర్ల శ్రీనివాసరావుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శనివారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. శ్రీనివాసరావు ప్రస్తుతం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
KDP: మైదుకూరు, రాజంపేట సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహాపూర్ణహుతి, వాసంతోత్సవం, ద్వజావరోహణ, కంకణ విసర్జణ కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నిర్వహించారు. హంస వాహనంపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రుడు పురవీధుల్లో విహరించగా, కోలాటాలు, డప్పులు, మేళతాలతో ఊరేగింపు నిర్వహించారు.