కృష్ణా: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెల 23 నుంచి PGDCA కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ జి. అంకమ్మరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ 9100033552, 8074932997 నంబర్లను సంప్రదించాలని సూచించారు.