SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు .