AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వై. వెంకట భాస్కరరావు మాట్లాడుతూ.. సభ్యులందరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. సీఈవో మల్ల స్వామి పాల్గొన్నారు.