GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.