VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.