ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.