E.G: దొంగతనాలతో దూబచర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆదివారం విమర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మొబైల్ ఫోన్స్, ఇళ్లలోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.