KRNL: ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించారు. దాడిలో పసిబిడ్డ మృతి చెందడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి భద్రత, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.