VSP: అనారోగ్య కారణంగా ఆర్కే బీచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ శనివారం కాపాడారు. ఎన్ఎడీ ప్రాంతానికి చెందిన నున్న చిట్టిబాబు (72) అనే వ్యక్తి అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జీవీఎంసీ లైఫ్ గార్డులు ఆనంద్, ధనరాజ్, ఆయనను కాపాడి సీపీఆర్ చేసి అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు.
శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో మార్చ్ 8 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ విషయమై విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వం కార్యాలయలలో జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు.
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్ శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామ్మన్నారు.
TPT: జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శనివారం 95.68 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 97.12 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ తొలి స్థానంలో ఉండగా.. 93.2 శాతంతో వాకాడు చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తిరుపతి జిల్లా 95.68 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది.
W.G: భీమవరం పట్టణంలోని పలు షాపులలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ షాపుల యజమానులకు ప్లాస్టిక్ వాడకంపై కలిగే నష్టాలను వివరించారు. పేపర్ కవర్లను, గుడ్డ సంచులను వాడే విధంగా అవగాహన కలిగించారు. ఈ కార్య క్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
VZM: 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. మధ్య తరగతి వారికి ప్రోత్సాహం కీలక రంగాలకు మద్దతు కలిగించేలా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ పోర్ట్, విశాఖ స్టీల్ తదితర వాటికి అనేక కేటాయింపులు చేసారన్నారు.
TPT: డిప్యూటీ మేయర్ ఎన్నికల అభ్యర్థిగా శేఖర్ రెడ్డి పేరు ప్రకటిస్తే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుందని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా వైసీపీ కార్పోరేట్ ప్రైవేట్ ఆస్తులపై అధికారులను పంపి భయపెట్టాలని చూడడం సరైనదికాదన్నారు.
NTR: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో ఒక్కో కుటుంబానికి రూ.500 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.5000 పంపిణీ జరిగింది. నందిగామ వాస్తవ్యులు, కీ॥శే పులిపాటి లక్ష్మీ రాజారావు- సుజాత లను స్మరించుకుంటూ ద్వితీయ కుమారుడు పులిపాటి శ్రీనివాస్-రమల ఏకైక కుమారుడు బ్రహ్మ తేజ సౌజన్యంతో పంపిణీ చేశారు.
VZM: జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే PGRS రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ జనవరి 29 నుండి మార్చి 8 వరకు అమలులోకి ఉన్నందున పోలీస్ గ్రీవెన్స్ రద్దు చేసినట్లుగా కోడ్ ముగిసిన తరువాతనే తిరిగి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తామని అన్నారు.
కృష్ణా: విజయవాడలో టాలీవుడ్ నటి నభా నటేశ్ సందడి చేశారు. శనివారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ షో రూమ్ ప్రారంభానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమాలో నటించిన తర్వాత అనేకసార్లు విజయవాడ వచ్చారని, దుర్గమ్మను దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నభా నటేశ్ను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.
ప్రకాశం: ముప్పవరం గ్రామంలో ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పదిమంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు జైపూర్ అలింకో సంస్థ ద్వారా 40 ట్రైసైకిల్ అందించామన్నారు.
NTR: ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ దేశం వెళ్లి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైన జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్ కుటుంబ సభ్యులను జగ్గయ్యపేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
NTR: విస్సన్నపేట స్థానిక మండలంలో సినిమా థియేటర్లను RDO కే.మాధురి, MRO సందర్శించారు. నిబంధనలను పాటించకుండా థియేటర్లు నడుపుట నేరం అన్నారు. అన్నీ అనుమతులు లేని థియేటర్లు వెంటనే నిలిపి వేయాలని థియేటర్ చెకింగ్లో భాగంగా తెలియజేసారు.
కృష్ణా: విజయవాడలోని పాస్ పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో రోజుకు అదనంగా 50 స్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో ప్రతి బుధవారం 250 అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తాజా అపాయింట్మెంట్లు, రీషెడ్యూల్ కోసం passportindia.gov.in వెబ్సైట్ సందర్శించాలి.