KRNL: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్డీరంగా విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమన్వయంతో జాతీయ తేనెటీగల మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనేటీగల పెంపకంపై 7 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్రచౌదరి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.