ASR: జీకే వీధి మండలం పేట్రాయి గ్రామంలో ఐదు గిరిజన కుటుంబాలకు చెందిన 7 గురు పిల్లలకు నేటికి ఆధార్ కార్డులు లేవు. పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి కావడంతో వీరికి చదువు దూరమవుతోంది. గిరిజన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి వారికి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.