SKLM: పోలాకి మండలం ఈదులవలస ఏపీ మోడల్ పాఠశాల ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ప్రిన్సిపల్ పైడి ప్రవీణ తెలియజేశారు. 344 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 332 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారి యు. శాంతారావు పరీక్షను పర్యవేక్షించారు