TPT: పుత్తూరు పరిధిలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణ, రోడ్డు భద్రత గురించి వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలపాలని కోరారు.