KNR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం పనితీరుకు ఇందిరమ్మ ఇళ్లు గీటురాయిగా నిలుస్తున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండలం మద్దికుంట, పచ్చునూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.