SDPT: జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంపులకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. కరీంనగర్ లోని 9వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో..కళాశాల క్యాడెట్లు శ్రీదేవి,అంజలి,అక్షయ,శివ తమ ప్రతిభను చాటి ఎంపికయ్యారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.