BPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీ-4 సిబ్బంది, నాయకులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 28 అర్జీలు అందగా, వీటిలో ఇంటి నిర్మాణం, స్థలాల కోసం 7, పింఛన్లకు సంబంధించిన 17, ఇతర సమస్యలపై 4 అర్జీలు స్వీకరించారు.