E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శుక్రవారం గ్రీవెన్స్ & పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం పార్టీకి మొదటి కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు.