CTR: వెదురుకుప్పం నుంచి చిత్తూరు వైపు అక్రమంగా గ్రానైట్ రాయి తరలిస్తున్న లారీని పెనుమూరు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో అనుమతులు లేని క్వారీల నుంచి రాళ్లను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అడ్డుకున్నా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.