అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 35 వార్డుల ఇన్ఛార్జ్, నాయకులు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి వార్డులో బలంగా పనిచేయాలని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.