కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,65,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 299 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 42 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 2369 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.