కర్నూలు పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులను ఇవాళ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ బి. కృష్ణమోహన్, కె. శ్రీనివాస రెడ్డి, ఎ. హరిహర నాథ శర్మలను పూలతో స్వాగతించారు. ఈ సందర్భంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి పాల్గొన్నారు.