నెల్లూరు: కందుకూరు అభివృద్ధికి నుడా సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి రూ. 4.27 కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఇప్పటికే రూ. 21.5 కోట్ల పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఎన్టీఆర్ సర్కిల్-అంకమ్మగుడి రోడ్డుకు రూ. 10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.