VZM: ఉద్యానవన పంటల సాగు ( హార్టికల్చర్ ) ను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కీలక అడుగులు వేస్తోందని గంట్యాడ AO శ్యామ్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న 181 మంది రైతులను గుర్తించామని, ఇప్పటికే బోరు బావులు, మోటార్లు సిద్ధంగా ఉన్న రైతులు వెంటనే ప్లాంటేషన్ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించారు.