VZM: మహిళా రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు.